Monday, August 15, 2016

గ్రహ సంఘర్షణ ప్రభావాలు 50 రోజులా?

ఖగోళంలో పరస్పర వైరమున్న కుజ గ్రహము మరియు శని గ్రహము 2016 ఆగష్టు 24వ తేదీన ఒకే డిగ్రీలోకి రావటం జరగనుంది. దీని ప్రభావం వలన ఆగష్టు 23 నుంచి అక్టోబర్ 10 వరకు 50 రోజుల పాటు కుజ, శని గ్రహాల సంఘర్షణ ప్రభావం ఉండును. అయితే ఈ సంవత్సరం ఫిబ్రవరి 20వ తేదీనే కుజుడు శని ఉన్న వృశ్చికరాశిలోనికి ప్రవేశించినప్పటకీ వక్ర గమనం వలన తిరిగి వెనుకకు తులా రాశిలోకి రావటం జరిగింది. జ్యోతిష శాస్త్ర రీత్యా ఈ రెండు గ్రహాల సంఘర్షణకి ముందు రోజులలోను, వెనుక రోజులలోను ప్రభావాలు ఉండునని చెప్పవచ్ఛును. 1984లో శని, కుజులు ఇరువురు తులా రాశిలో కలవటం, దాని ప్రభావముచే కలయిక ముందు వెనుకలలో భారతదేశంలో తీవ్ర పరిణామాలు చోటు చేసుకున్నాయి.  పంజాబ్ లో గోల్డెన్ టెంపుల్ యందు ఆపరేషన్ బ్లూస్టార్ ద్వారా కాల్పులు, భోపాల్ లో గ్యాస్ పేలుడు, ఆనాటి ప్రధానమంత్రి  అంగరక్షకులు కాల్పులు చేయటం వంటివాటితో పాటు ప్రపంచ వ్యాప్తంగా అక్కడక్కడా పలు పరిణామాలు చోటు చేసుకున్నట్లు చరిత్ర దాఖలాలు ఉన్నాయి. మరి ఈ 2016లోని శని, కుజుల సంఘర్షణ ప్రభావం ఆగష్టు 23 నుంచి అక్టోబర్ 11వ తేదీ వరకు (50 రోజుల పాటు) ఉంటుంది.

ఈ ప్రభావముచే అల్జీరియా, మొరాకో, బ్రెజిల్, వాషింగ్టన్, దుబాయ్, ఇండోనేషియా, సూరత్, మధ్యప్రదేశ్, మలేసియా, పోలాండ్, ఐర్లాండ్, ఇరాన్, నార్త్ కొరియా, సౌదీ అరేబియా, ఉక్రెయిన్, చైనా, కాలిఫోర్నియా, జపాన్, జార్జియా, టాంజానియా, హిందూకుష్ పర్వతాలు మొదలైన చోట్ల భారీ భూకంప సూచనలతో పాటు హిందూ మహా సముద్రం మరియు సుమత్రా దీవులలో సునామీ అవకాశాలు ఉన్నవి. ఇవి ప్రకృతి సంబంధితములు.

అంతేకాక ఇజ్రాయిల్, పారిస్, రష్యా, టర్కీ, ఉక్రెయిన్, సిరియా, నార్త్ కొరియా, చైనా, యు.యస్.ఏ, సౌదీ అరేబియా, పాలస్తీనా దేశాలలో అధిక తీవ్రవాద చర్యలతో పాటు కొన్ని ప్రాంతాలలో యుద్ధాలకు కాలు దువ్వే విధంగా ప్రభుత్వాలు మరియు రాజకీయ సంక్షోభాలు ఉండును. అలాగే భారతదేశంలో కాశ్మీర్ మరియు ఇతర కొన్ని రాష్ట్రాలలో ఉగ్రవాద, తీవ్రవాద చర్యలతో పాటు కొన్ని చోట్ల రాజకీయ సంక్షోభాలతో పాటు కొంతమంది ప్రముఖ రాజకీయ నాయకులకు సమస్యలున్నవని జ్యోతిష శాస్త్ర రీత్యా చెప్పవచ్చును.

గమనిక: పై వివరములు ఓ జ్యోతిష శాస్త్ర విశ్లేషణగా తెలియచేస్తున్నాను. ఇది ఒక జ్యోతిష అంచనా మాత్రమే. కొన్నిసార్లు రుజువు కాక పోవచ్చును కూడా. ఇది ప్రత్యేక వ్యక్తులను ఉద్దేశించి చెప్పినవి కానే కాదు, అలాగే భయం చెందే విధంగా చెప్పినవి అంతకంటే కాదు. ఉగ్రవాదం మితిమీరుతున్న ఈ రోజులలో ప్రతివారు తగు జాగ్రత్తలతో ఉండాలని చెప్పే ఒక సూచనగా మాత్రమే భావించాలని మనవి. చాప క్రింద నీరులా పాకుతున్న ఉగ్రవాదుల ఆచూకీలు ఎక్కడైనా ప్రజలు గమనించినా, అనుమానం వచ్చినా  తక్షణమే సమీప పోలీస్ శాఖ వారికి తెలియచేయవలసినదిగా మనవి.

పూర్తి వివరాలు రేపటి నుంచి grahabhumi.blogspot.com లో అందిస్తుంటాను. - దైవజ్ఞ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.