Saturday, March 26, 2016

నాగ బంధన నివృత్తికై ఏప్రిల్ 3న విశాఖ జిల్లాలో 2వ మహా సూర్య యాగం

శతాబ్దాల తదుపరి అరుదైన రీతిలో నాగబంధనం గురు చండాల యోగంలో జరగనుంది.  సింహరాశిలో గజరాజుపై పరివేష్టితుడైన గురు గ్రహం, మృగరాజుపై ఆశీనుడైన రాహువుచే  జూన్ 25 శనివారం సూర్యోదయానికి పూర్వము 3గంటల 34 నిముషాలకు నాగ బంధనం జరుగును. ఇది కేవలం రెండు సెకన్లు మాత్రమే బంధనం జరుగును. దీనినే నాగదోషము అని కూడా అంటారు.

2016 జనవరి 29 నుంచి ప్రారంభమై ఆగష్టు 11 వరకు గురు రాహు కలయికచే గురు చండాల యోగం జరుగును. అయితే ఈ గురు చండాల యోగం సింహరాశిలో జరుగుతున్నది కనుక, దాని అధిపతి సూర్యునికి 9 మార్చి 2016న సంపూర్ణ సూర్యగ్రహణం, తిరిగి 1 సెప్టెంబర్ 2016 న మరో సంపూర్ణ సూర్య గ్రహణం సంభవించును.

ఈ రెండు గ్రహణాల మధ్యలో 17 ఏప్రిల్ 2016 నుంచి 17 జూన్ 2016 వరకు కుజ గ్రహం, శని గ్రహం పరస్పరం శత్రు గ్రహాలై, ఇరువురూ వెనుకకు నడవటం అనుకూల ఫలితాలను అందివ్వదు. నాగ బంధనం, గురు చండాల యోగం, తదితర వ్యతిరేక గ్రహస్థితుల ప్రభావం మానవాళిపై ఉండును. ఆర్ధిక, ఆరోగ్య, గృహ, సంతాన, కుటుంబ, దాంపత్య అంశాలపై చూపును.  కనుకనే ప్రతివారు తగు తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంది.

ఈ గ్రహభూమి బ్లాగ్లో ఆదివారం నాడు వెలిగించే గోధుమ పిండి దీపారాధనతో పాటు, గ్రహ సంచార స్థితి గతులు తగ్గుటకై చివరలో ఇచ్చే నంబర్లకు కాల్ చేసి వివరాలను తెలుసుకోవచ్చును.

కనుకనే శతాబ్దాల తర్వాత వచ్చే ఈ వ్యతిరేక గురు చండాల యోగ ప్రభావ నివృత్తికై రెండు తెలుగు రాష్ట్రాలలో జరుగును. ఇందులో భాగంగా రెండవ యాగం విశాఖపట్టణానికి సమీపంలో జరుగును. ఆనాడు యోగి టెలివిజన్ ఛానెల్ ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షప్రసారం చేయును.

విశాఖ జిల్లా యలమంచిలికి 7 కిలోమీటర్ల దూరంలో గల శతాబ్దాల నాటి చోళ రాజులచే నిర్మితమైన పుణ్యక్షేత్రంలో ఈ రెండవ యాగం జరుగును. మైళ్ళ కొలది పాములా వ్యాపించి ఉన్న ఫణిగిరి కొండల శ్రేణువులో 5 గజముఖ శిల్ప రూపంనుంచి ధారాపాతంగా స్వచ్చమైన నీరు శతాబ్దాల నుంచి రావటం మహా విశేషం. 5 ధారలుగా నీరు వచ్చే ఈ క్షేత్రం కాలక్రమంలో పంచధార, పంచధార్లగా వ్యవహరింపబడుతున్నది. ఈ క్షేత్రంలో నిర్వహణ ఏర్పాట్లను ఆ గ్రామ మాజీ విలేజ్ ఆఫీసర్ వసంతవాడ పురుషోత్తమ రాజు (రాజబాబు) గారు పర్యవేక్షిస్తున్నారు. 





శతాబ్దాల తదుపరి అరుదైన రీతిలో నాగబంధనం గురు చండాల యోగంలో జరగనుంది. సింహరాశిలో గురు రాహు కలయిక 2016 మార్చి 29 నుంచి ప్రారంభమై ఆగష్టు 11 వరకు ఉండును. ఇందులో భాగంగా 2016 జూన్ 25 న గురువుపై రాహు బంధనం జరగనుంది. ఇందుకోసంగా మానవాళి శ్రేయస్సుకై నందనవనం నాగ ఛారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో నేను మరియు స్టూడియో ఎన్ టెలివిజన్ ఛానల్ వారి అనుబంధ సంస్థయైన యోగి శాటిలైట్ టీవీ వారి సంయుక్త ఆధ్వర్యంలో, రెండు తెలుగు రాష్ట్రాలో 7 సార్లు దోష నివృత్తికై సప్త మహా సూర్య యాగాలు జరగనున్నవి. రెండవ యాగం విశాఖపట్టణానికి సమీపంలో జరుగును. ఆనాడు యోగి టెలివిజన్ ఛానెల్ ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షప్రసారం చేయును. విశాఖ జిల్లా యలమంచిలికి 7 కిలోమీటర్ల దూరంలో గల శతాబ్దాల నాటి చోళ రాజులచే నిర్మితమైన పుణ్యక్షేత్రంలో ఈ రెండవ యాగం జరుగును. మైళ్ళ కొలది పాములా వ్యాపించి ఉన్న ఫణిగిరి కొండల శ్రేణువులో 5 గజముఖ శిల్ప రూపంనుంచి ధారాపాతంగా స్వచ్చమైన నీరు శతాబ్దాల నుంచి రావటం మహా విశేషం. 5 ధారలుగా నీరు వచ్చే ఈ క్షేత్రం కాలక్రమంలో పంచధార, పంచధార్లగా వ్యవహరింపబడుతున్నది. ఈ క్షేత్రంలో నిర్వహణ ఏర్పాట్లను ఆ గ్రామ మాజీ విలేజ్ ఆఫీసర్ వసంతవాడ పురుషోత్తమ రాజు (రాజబాబు) గారు పర్యవేక్షిస్తున్నారు.
Posted by Sreenivasa Gargeya Ponnaluri on Saturday, March 26, 2016
పూర్తి వివరములకై 7337596524, 7337596521, 7702021818 నంబర్లకు ఫోన్లు చేసి తెలుసుకొనవచ్చును.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.