Sunday, July 22, 2012

ఒకేసారి ఆచరించే నవరక్షాకవచ పూజ విధి - భాగం 1

శ్రీ నందన నామ సంవత్సర శ్రావణ శుక్ల త్రయోదశి సోమవారం సరియగు తేది 2012 జూలై 30 మూల నక్షత్రంలో సాయంత్ర సమయంలో తొమ్మిది కలశపూజలు ఒకేసారి ఆచరించుటకు అనువైన సమయము. ఆగష్టు 1 బుధవారం నుంచి వారం రోజుల లోపు ఏరోజైన మధ్యాహ్నంలోపు శ్రీ సూర్య నారాయణమూర్తికి పగటి సమయంలో రక్షా కవచాలన్నింటిని చూపిస్తూ ఉత్తేజపరుచుటకు అనువైన సమయము. లేదా ఒకటవ తేది బుధవారం రాత్రి మాత్రమే చంద్రునికి రక్షాకవచాలను చూపిస్తూ క్రియాత్మక ఉత్తేజతకు అనువైన సమయము. ఒకేసారి తొమ్మిది కలశపూజలు పైన చెప్పిన జూలై 30  సోమవారం నాడు ఆచరించిన వారు ఆగష్టు 6 ఆదివారం లేదా 9 గురువారము లేదా 12 ఆదివారము లేదా 13 సోమవారాలలో ఉదయ సమయాలలోనే గోధుమపిండి దీపారాధనకు అనువైన సమయము.

ఒకే పర్యాయము తొమ్మిది రక్షాకవచాలను పొందాలనుకున్నవారు వాటి నిర్మాణ సైజులలో నియమాలు పాటించాల్సిన అవసరం ఉన్నది. ఈ ఒకేసారి కలశపూజ ఆచరించే వారికి నవరక్షా కవచాలలో మొదటి ఏడు వస్త్ర రూపంలో ఉండును. ఎనిమిదవ రక్షా కవచం నాణెంగాను, తొమ్మిదవ రక్షాకవచం ఎరుపు రంగు దారంతో ఉన్న సూత్రముగా ఉండును.
 
 
ఒకటవ రక్షాకవచం 15 x 15 అంగుళాల సైజులో పసుపువర్ణ వస్త్రంపై కుంకుమ, నేతితో స్వస్తిక్ చిహ్నము చిత్రించాలి.

రెండవ రక్షాకవచం 14 x 14 అంగుళాల సైజులో తెలుపువర్ణ వస్త్రంపై పసుపు, నేతితో త్రిభుజ చిహ్నము చిత్రిస్తూ...  త్రిభుజంలోపల ఓ బిందువును, త్రిభుజానికి మూడు వైపులా ఐదేసి బిందువుల చొప్పున 15 బిందువులను కుంకుమ, నేతితో చిత్రించుకోవాలి.

మూడవ రక్షాకవచం 13 x 13 అంగుళాల సైజులో తెలుపు వర్ణ వస్త్రంపై కుంకుమ, నేతితో శ్రీం బీజాక్షరమును వ్రాయాలి.

నాల్గవ రక్షాకవచం 12 x 12 అంగుళాల సైజులో పసుపు వర్ణ వస్త్రంపై కుంకుమ, నేతితో హ్రీం బీజాక్షరమును వ్రాయాలి.

ఐదవ రక్షాకవచం 11 x 11 అంగుళాల సైజులో తెలుపు వర్ణ వస్త్రంపై కుంకుమ, నేతితో ఐం బీజాక్షరమును వ్రాయాలి.

ఆరవ రక్షాకవచం 10 x 10 అంగుళాల సైజులో పసుపు వర్ణ వస్త్రంపై కుంకుమ, నేతితో గం బీజాక్షరమును వ్రాయాలి.

ఏడవ రక్షాకవచం 9 x 9 అంగుళాల సైజులో తెలుపు వర్ణ వస్త్రంపై కుంకుమ, నేతితో లేక పసుపు, నేతితో ఓం బీజాక్షరమును వ్రాయాలి.

ఎనిమిదవ రక్షాకవచము నాణెము. ప్రస్తుతం చలామణిలో ఉన్న నాణెం గాని లేక ప్రస్తుత చలామణిలో లేని పురాతన రాగి లేక వెండి నాణెము గాని వినియోగించవచ్చు. ఈ నాణెముల సంఖ్య వినియోగంలో పరిమితి లేదు.

తొమ్మిదవ రక్షాకవచంగా ఎరుపు రంగు కాటన్ దారము లేక ఊలు దారమును తీసుకోవాలి. ఈ దారమును షుమారు 12 అంగుళాల పొడవుతో 11 వరుసలను వేసుకోవాలి. ఈ 11 పోగులతో ఉన్న ఎరుపు రంగు తోరనికి మధ్యలో ఒక ముడిని వేసుకోవాలి. దీనినే రక్షాసూత్ర కవచంగా భావించాలి.


పూజా పద్ధతి
  1. 2012 జూలై 30 సోమవారం సాయంత్ర సమయంలో ఆచరించుకొనేది.
    ఒకరి తరఫున మరొకరు కూడా ఆచరించవచ్చును. సంకల్పం ముఖ్యము.
    పుణ్య స్త్రీలు, వైదవ్య స్త్రీలు, బాలలు, అవివాహితులు, వృద్దులు, పురుషులు (భార్యా వియోగులు కూడా) ఎవరైనను ఆచరించవచ్చును.
    పురుడు లేక మరణ అశౌచము వున్నవారు ఆచరించవద్దు 
    ఆరవ మాసం ప్రారంభమైన గర్భిణులు వద్దు.
    విదేశాలలో వున్న వారి కొరకు ఇక్కడ వారు ఆచరించవచ్చు.

  2. గృహం లోని ఈశాన్య భాగంలో కాని లేక ఈ ఇతర భాగంలో కాని మీరు తూర్పు దిశగా చూసేలా పూజను చేసుకోండి.
  3. ఓ పీట వుంచి దానిపై ఎరుపు వస్త్రాన్ని పరవండి. దానిపై బియ్యాన్ని పోసి, గుండ్రంగా లేక చదరంగా లేక దీర్ఘ చతురశ్రంగా నెరపండి.
  4. దీపారాధన చేసుకోండి.
  5. తిథి, వార, నక్షత్రాలతో పాటుగా గోత్ర నామాలతో సంకల్పం చెప్పుకొని పసుపుతో చేసిన గణపతిని బియ్యంపై తమలపాకులలో ఉంచి ప్రార్దించండి.
  6. గణపతికి ధూప, దీపాలను ఇవ్వండి. నైవేద్యంగా బెల్లాన్ని నివేదించండి. అవకాశం ఉన్నవారు గణపతి పూజను పూర్తిగా ఆచరించవచ్చు. 
  7. గణపతి పూజ అనంతరం, గణపతికి ఉద్వాసన చెప్పి పూజా పీటకు ఈశాన్య భాగంలో ఉంచండి.
  8. తదుపరి బియ్యంపైన స్వస్తిక్ మార్క్ రుమాలును వుంచండి. స్వస్తిక్ దిగువన ఉన్న వస్త్రపు కోణము మీ వైపుకు ఉండేలా పెట్టుకోండి.
  9. స్వస్తిక్ రక్షాకవచం పై మీకు అర్ధమయ్యే లాగా 1 నుంచి 8 వరకు సంఖ్యలు ఇచ్చితిని. ఇది కేవలం గుర్తు కోసమే.  
  10. వరుస శ్లోకాలను పఠి౦చేటప్పుడు, వరుస సంఖ్యల దగ్గర అక్షతలను వేయండి.
  11. మూడు కొబ్బరి గిన్నెలను పూజలో ఉంచుకొనండి.
    స్వస్తిక్ రక్షాకవచ పూజా విధి ( 1 )
  • ముందుగా ఒక పుష్పాన్ని స్వస్తిక్ రక్షాకవచం మధ్యన ఉంచండి.
  • భక్తితో నమస్కరించుకోనండి. పుష్పాన్నితీసి మొదటి ఎండు కొబ్బరి గిన్నెలో ఉంచుకోవాలి.
  • తదుపరి క్రింది శ్లోకాలకు... "ఓం" అను ప్రణవమును జోడించి భక్తితో పఠి౦చాలి.
లలితా సహస్రనామ స్తోత్రంలోని 1 వ శ్లోకాన్ని చదువుతూ 
1 వ సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.  
2 వ శ్లోకాన్ని చదువుతూ 2 వ సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
3 వ శ్లోకాన్ని చదువుతూ 3సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
4 వ శ్లోకాన్ని చదువుతూ 4సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
5 వ శ్లోకాన్ని చదువుతూ 5సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
6 వ శ్లోకాన్ని చదువుతూ 6సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
7 వ శ్లోకాన్ని చదువుతూ 7 సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
8 వ శ్లోకాన్ని చదువుతూ 8 సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి. 
  • రెండవ పుష్పాన్ని స్వస్తిక్ రక్షాకవచం మధ్యన ఉంచుకొని ప్రార్దించి,
  • దానిని భక్తీతో రెండవ ఎండు కొబ్బరి గిన్నెలో వేసుకొండి.
  • తదుపరి క్రింది శ్లోకాలకు... "ఓం" అను ప్రణవమును జోడించి భక్తితో పఠి౦చాలి.
లలితా సహస్రనామ స్తోత్రంలోని 9 వ శ్లోకాన్ని చదువుతూ 
1 వ సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
10 వ శ్లోకాన్ని చదువుతూ 2 వ సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
11 వ శ్లోకాన్ని చదువుతూ 3సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
12 వ శ్లోకాన్ని చదువుతూ 4సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
13 వ శ్లోకాన్ని చదువుతూ 5సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
14 వ శ్లోకాన్ని చదువుతూ 6సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
15 వ శ్లోకాన్ని చదువుతూ 7 సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
16 వ శ్లోకాన్ని చదువుతూ 8 సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి. 
  • మూడవ పుష్పాన్ని స్వస్తిక్ రక్షాకవచం మధ్యన ఉంచుకొని ప్రార్దించి,
  • దానిని భక్తీతో మూడవ ఎండు కొబ్బరి గిన్నెలో వేసుకొండి.
  • తదుపరి క్రింది శ్లోకాలకు... "ఓం" అను ప్రణవమును జోడించి భక్తితో పఠి౦చాలి. 
లలితా స్తోత్రంలోని  
17 వ శ్లోకాన్ని చదువుతూ 1 వ సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి. 
18 వ శ్లోకాన్ని చదువుతూ 2 వ సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
19 వ శ్లోకాన్ని చదువుతూ 3సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
20 వ శ్లోకాన్ని చదువుతూ 4సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
21 వ శ్లోకాన్ని చదువుతూ 5సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
22 వ శ్లోకాన్ని చదువుతూ 6సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
23 వ శ్లోకాన్ని చదువుతూ 7 సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
24 వ శ్లోకాన్ని చదువుతూ 8 సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
 
దిగువ ఇచ్చిన ప్రతి నామాన్ని 5 సార్లు భక్తి పూర్వకంగా చేతులు జోడించి స్వస్తిక్ రక్షాకవచాన్ని వీక్షిస్తూ పఠించండి.
లలిత సహస్రనామం లో 742 నుంచి 749 వరకు వున్న నామాలు.
ఓం భవదావసుధావృష్ట్యై నమః
ఓం పాపారణ్యదవానలాయై నమః
ఓం దౌర్భాగ్యతూలవాతూలాయై నమః
ఓం జరాధ్వాంతరవిప్రభాయై నమః
ఓం భాగ్యాబ్ధిచంద్రికాయై నమః
ఓం భక్తచిత్తకేకిఘనాఘనాయై నమః
ఓం రోగపర్వతదంభోల్యై నమః
ఓం మృత్యుదారుకుఠారికాయై నమః
ఇంతటితో స్వస్తిక్ రక్షాకవచ పూజ పూర్తయినది. 
    షోడశబిందు సహిత  త్రిభుజ రక్షాకవచ పూజా విధి (2 )
    తరువాత స్వస్తిక్ రక్షాకవచంపై షోడశ బిందు సహిత త్రిభుజ వస్త్ర రుమాలును ఉంచండి.
    వస్త్రంలోని త్రిభుజ కోణము మీ వైపుకు ఉండేలా, స్వస్తిక్ రుమాలు పై వేయండి.
    షోడశ బిందు సహిత త్రిభుజ రక్షాకవచం పై మీకు అర్ధమయ్యే లాగా 1 నుంచి 8 వరకు సంఖ్యలు ఇచ్చితిని. ఇది కేవలం గుర్తు కోసమే.
     
     
  • వరుస శ్లోకాలను పఠి౦చేటప్పుడు, వరుస సంఖ్యల దగ్గర అక్షతలను వేయండి.
  • ముందుగా ఒక పుష్పాన్ని షోడశ బిందు సహిత త్రిభుజ రక్షాకవచం మధ్యన ఉంచండి.
  • భక్తితో నమస్కరించుకొనండి. పుష్పాన్నితీసి మొదటి ఎండు కొబ్బరి గిన్నెలో ఉంచుకోవాలి.
  • తదుపరి క్రింది శ్లోకాలకు... "ఓం" అను ప్రణవమును జోడించి భక్తితో పఠి౦చాలి.
    లలితా సహస్రనామ స్తోత్రంలోని 25 వ శ్లోకాన్ని చదువుతూ 1 వ సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.  
    26 వ శ్లోకాన్ని చదువుతూ 2 వ సంఖ్యదగ్గర అక్షతలు వేయాలి.
    27 వ శ్లోకాన్ని చదువుతూ 3సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
    28 వ శ్లోకాన్ని చదువుతూ 4సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
    29 వ శ్లోకాన్ని చదువుతూ 5సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
    30 వ శ్లోకాన్ని చదువుతూ 6సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
    31 వ శ్లోకాన్ని చదువుతూ 7 సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
    32 వ శ్లోకాన్ని చదువుతూ 8 సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
  • రెండవ పుష్పాన్ని షోడశ బిందు సహిత త్రిభుజ రక్షాకవచం మధ్యన ఉంచుకొని ప్రార్దించి,
  • దానిని భక్తీతో రెండవ ఎండు కొబ్బరి గిన్నెలో వేసుకొండి.
  • తదుపరి క్రింది శ్లోకాలకు... "ఓం" అను ప్రణవమును జోడించి భక్తితో పఠి౦చాలి.
    లలితా సహస్రనామ స్తోత్రంలోని 33 వ శ్లోకాన్ని చదువుతూ 1 వ సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
    34 వ శ్లోకాన్ని చదువుతూ 2 వ సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
    35 వ శ్లోకాన్ని చదువుతూ 3సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
    36 వ శ్లోకాన్ని చదువుతూ 4సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
    37 వ శ్లోకాన్ని చదువుతూ 5సంఖ్యదగ్గర అక్షతలు వేయాలి.
    38 వ శ్లోకాన్ని చదువుతూ 6సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
    39 వ శ్లోకాన్ని చదువుతూ 7 సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
    40 వ శ్లోకాన్ని చదువుతూ 8 సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
    మూడవ పుష్పాన్ని స్వస్తిక్ రక్షాకవచం మధ్యన ఉంచుకొని ప్రార్దించి,
    దానిని భక్తీతో మూడవ ఎండు కొబ్బరి గిన్నెలో వేసుకొండి.
    తదుపరి క్రింది శ్లోకాలకు... "ఓం" అను ప్రణవమును జోడించి భక్తితో పఠి౦చాలి.
    లలితా సహస్రనామ స్తోత్రంలోని 41 వ శ్లోకాన్ని చదువుతూ 1 వ సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
    42 వ శ్లోకాన్ని చదువుతూ 2 వ సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
    43 వ శ్లోకాన్ని చదువుతూ 3సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
    44 వ శ్లోకాన్ని చదువుతూ 4సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
    45 వ శ్లోకాన్ని చదువుతూ 5సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
    46 వ శ్లోకాన్ని చదువుతూ 6సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
    47 వ శ్లోకాన్ని చదువుతూ 7 సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
    48 వ శ్లోకాన్ని చదువుతూ 8 సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
లలితా సహస్రనామాలలో 71 వ నామమైన ఓం జ్వాలామాలినికాక్షిప్తవహ్నిప్రాకారమధ్యగాయై నమః అను నామాన్ని భక్తి పూర్వకంగా చేతులు జోడించి షోడశ బిందు త్రిభుజరక్షాకవచాన్ని వీక్షిస్తూ 40 పర్యాయములు పఠించండి.
ఇంతటితో షోడశ బిందు రక్షాకవచ పూజ పూర్తయినది.
    "శ్రీం" బీజ రక్షాకవచ పూజా విధి ( 3 )
తరువాత షోడశ బిందు సహిత త్రిభుజ రక్షాకవచంపై  శ్రీం బీజ రక్షాకవచాన్ని ఉంచండి.
శ్రీం బీజ రక్షాకవచం పై మీకు అర్ధమయ్యే లాగా 1 నుంచి 8 వరకు సంఖ్యలు ఇచ్చితిని. ఇది కేవలం గుర్తు కోసమే.   
 
 
  • వరుస శ్లోకాలను పఠి౦చేటప్పుడు, వరుస సంఖ్యల దగ్గర అక్షతలను వేయండి.
  • ముందుగా ఒక పుష్పాన్నిశ్రీం బీజ రక్షాకవచం మధ్యన ఉంచండి. 
  • భక్తితో నమస్కరించుకొనండి. పుష్పాన్నితీసి మొదటి ఎండు కొబ్బరి గిన్నెలో ఉంచుకోవాలి.
  • తదుపరి క్రింది శ్లోకాలకు... "ఓం" అను ప్రణవమును జోడించి భక్తితో పఠి౦చాలి. 
    లలితా సహస్రనామ స్తోత్రంలోని 
    49 వ శ్లోకాన్ని చదువుతూ 1 వ సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.  
    50 వ శ్లోకాన్ని చదువుతూ 2 వ సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి. 
    51 వ శ్లోకాన్ని చదువుతూ 3సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
    52 వ శ్లోకాన్ని చదువుతూ 4సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
    53 వ శ్లోకాన్ని చదువుతూ 5సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
    54 వ శ్లోకాన్ని చదువుతూ 6సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
    55 వ శ్లోకాన్ని చదువుతూ 7 సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
    56 వ శ్లోకాన్ని చదువుతూ 8 సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
  • రెండవ పుష్పాన్నిశ్రీం బీజ రక్షాకవచం మధ్యన ఉంచండి.  
  • భక్తితో నమస్కరించుకొనండి. పుష్పాన్నితీసి రెండవ ఎండు కొబ్బరి గిన్నెలో ఉంచుకోవాలి.   
  • తదుపరి క్రింది శ్లోకాలకు... "ఓం" అను ప్రణవమును జోడించి భక్తితో పఠి౦చాలి.
లలితా సహస్రనామ స్తోత్రంలోని  
57 వ శ్లోకాన్ని చదువుతూ 1 వ సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
58 వ శ్లోకాన్ని చదువుతూ 2 వ సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
59 వ శ్లోకాన్ని చదువుతూ 3సంఖ్యదగ్గర అక్షతలు వేయాలి.
60 వ శ్లోకాన్ని చదువుతూ 4సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
61 వ శ్లోకాన్ని చదువుతూ 5సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
62 వ శ్లోకాన్ని చదువుతూ 6సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
63 వ శ్లోకాన్ని చదువుతూ 7 సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
64 వ శ్లోకాన్ని చదువుతూ 8 సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
  • మూడవ పుష్పాన్నిశ్రీం బీజ రక్షాకవచం మధ్యన ఉంచుకొని ప్రార్దించి,
  • పుష్పాన్ని తీసి భక్తీతో మూడవ ఎండు కొబ్బరి గిన్నెలో వేసుకొండి.
  • తదుపరి క్రింది శ్లోకాలకు... "ఓం" అను ప్రణవమును జోడించి భక్తితో పఠి౦చాలి. 
లలితా సహస్రనామ స్తోత్రంలోని 
 65 వ శ్లోకాన్ని చదువుతూ 1 వ సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి. 
66 వ శ్లోకాన్ని చదువుతూ 2 వ సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
67 వ శ్లోకాన్ని చదువుతూ 3సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
68 వ శ్లోకాన్ని చదువుతూ 4సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
69 వ శ్లోకాన్ని చదువుతూ 5సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
70 వ శ్లోకాన్ని చదువుతూ 6సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
71 వ శ్లోకాన్ని చదువుతూ 7 సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
72 వ శ్లోకాన్ని చదువుతూ 8 సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
 
ఈ దిగువ ఇచ్చిన 11 నామాలను నిశితంగా పరిశీలించండి.
 
1.        ఓం శ్రీమాత్రే నమః                              ఇది లలిత సహస్ర నామాలలో 1 వ నామం
  
2.      ఓం శ్రీమహారాజ్ఞ్యై నమః                      ఇది లలిత సహస్ర నామాలలో 2 వ నామం  

3.      ఓం శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః           ఇది లలిత సహస్ర నామాలలో 3 వ నామం

4.      ఓం శ్రీమన్నగరనాయికాయై నమః      ఇది లలిత సహస్ర నామాలలో 56 వ నామం

5.      ఓం శ్రీకర్యై నమః                            ఇది లలిత సహస్ర నామాలలో 127 వ నామం 
  
6.      ఓం శ్రీకంఠార్ధశరీరిణ్యై నమః             ఇది లలిత సహస్ర నామాలలో 392 వ నామం
  
7.      ఓం శ్రీవిద్యాయై నమః                     ఇది లలిత సహస్ర నామాలలో 585 వ నామం  

8.      ఓం శ్రీషోడశాక్షరీవిద్యాయై నమః       ఇది లలిత సహస్ర నామాలలో 587 వ నామం

9       ఓం శ్రీచక్రరాజనిలయాయై నమః       ఇది లలిత సహస్ర నామాలలో 996 వ నామం 

10.    ఓం శ్రీమత్త్రిపురసుందర్యై నమః         ఇది లలిత సహస్ర నామాలలో 997 వ నామం
  
11.    ఓం శ్రీశివాయై నమః                       ఇది లలిత సహస్ర నామాలలో 998 వ నామం
  
 
 
  • ఈ నామాలను మొదటిసారి పై నుంచి దిగువ వరకు పఠి౦చండి. రెండవ సారి క్రింద నుంచి పైకి పఠి౦చండి. మూడవసారి పై నుంచి క్రిందకి పఠి౦చండి. ఈ విధంగా మొత్తం 9 పఠి౦చాలి.
  • అనగా పైన నుంచి క్రిందకు 5 సార్లు గాను, క్రింద నుంచి పైకి 4 సార్లు గాను అయినది.
  • అనగా 99 నామాలను పఠి౦చినట్లు అగును. పై నుంచి చదివేటప్పుడు ఓం శ్రీ మాత్రే నమః అంటూ మొదలు పెడతాం. ఒకసారి 11 నామాలను చదివితే ఒక శక్తి కోణం అగును.
  • క్రింద నుంచి పైకి చదివేటప్పుడు ఓం శ్రీ శివాయై నమః అంటూ మొదలు పెడతాం. ఒకసారి 11 నామాలను చదివితే ఒక శివకోణం అగును.
  • ఆ విధంగా పై నుంచి క్రిందకి 5 సార్లు అనగా 5 శక్తి కోణాలు..... క్రింద నుంచి పైకి 4 సార్లు అనగా 4 శివ కోణాలు అగును.
  • శ్రీ చక్రంలో మధ్యభాగం లో ఉన్నబిందువుకు దిగువన 5 ముక్కోణాలు ఉండును. వీటిని శక్తి కోణాలు అంటారు.
  • శ్రీ చక్రంలో మధ్యభాగం లో ఉన్నబిందువుకు ఎగువున 4 ముక్కోణాలు ఉండును. వీటిని శివ కోణాలు అంటారు.
  • కనుక మొత్తం 99 నామాలలో..... 9 + 9 =18 ......... 1+ 8 = 9. ఈ తొమ్మిదే శివ శక్తుల కలయిక.
ఇంతటితో శ్రీం బీజ రక్షాకవచ పూజ పూర్తయినది.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.