Sunday, March 11, 2012

మార్చ్ 14 నాటి కలశపూజ సంపూర్ణ వివరాలు

మార్చ్ 14 బుధవారం 4 వ కలశపూజ మాత్రమే
  1. 2012 మార్చ్ 14 బుధవారం కేవలం నాల్గవ కలశపూజ మిగులుగా ఉన్నవారు మాత్రమే భారతదేశంలో మరియు విదేశాలలో మార్చ్ 14 ఉదయం 6  గంటల నుంచి 10 గంటల లోపల ఆచరించుకోవాలి.
  2. ఉదయం నుంచి ఎటువంటి ఆహార నియమములు లేవు.
  3. ఇంతవరకు మీ వద్ద స్వస్తిక్ మార్క్ రుమాలు, 11 పోగుల ఎరుపు దారంతో చేసిన సూత్రము, నాణెములు ఉన్నవి.
  4. ఇప్పుడు 4 వ రక్షాకవచాన్ని సిద్దం చేసుకోవాలి. 
  5. స్వస్తిక్ మార్క్ రుమాలు కంటే నాలుగు వైపులా స్వల్పంగా తగ్గుదలతో వుండే మరో తెలుపు వస్త్రాన్ని తీసుకొనండి.
  6. పసుపును నేతితో కలిపి వస్త్రం పై మధ్య భాగంలో త్రిభుజాన్ని వేయండి.
  7. కుంకుమను నేతితో కలిపి త్రిభుజానికి మూడువైపులా 15 బిందువులను, త్రిభుజం మధ్యలో పెద్ద బిందువును వేయండి.
  8. పూజకు ఏరంగు  పుష్పాలైనను వినియోగించండి.
  9. పసుపు , నెయ్యి కలిపిన అక్షతలు సిద్దం చేసుకోండి.
  10. దీపారాధనకు వాడే తైలము మీ నిర్ణయము.  వత్తుల సంఖ్య, ప్రమిదల సంఖ్య మీ నిర్ణయమే.
  11. కలశం మీద పీచు తీసిన కొప్పులా ఉండే కొబ్బరికాయను ఉంచాలి. కొబ్బరికాయను కుంకుమతో చక్కగా అలంకరించుకోండి.
  12. నివేదనకు బెల్లంతో చేసిన బియ్యపు పొంగలి. కొబ్బరికాయ ఇతర ఫలములు మొదలైనవి నివేదిన్చాతము మీ ఇష్టానుసారం. 
  13. ఇక పూజకు ఓ పీట, పీట పైన పరిచే ఎరుపు రంగు లేక ఏ రంగు వస్త్రమైన లేక అంతకు ముందు పూజలకు వాడిన వస్త్రమైనను వినియోగించవచ్చు
  14. వస్త్రం పైన మంచి బియ్యం, పూజకు అగరు బత్తీలు , కర్పూరము మొదలగునవి అవసరము.
  15. కలశంలోని కొబ్బరికాయ క్రింద ఉంచుటకు 5 మామిడాకులు అవసరము.
  16. సహజంగా ప్రతి ఇంటిలో పూజలకు వినియోగించుకొనే గంట మొదలగు సామగ్రిని వినియోగించుకోండి. 
    పూజా పద్ధతి
2012 మార్చ్ 14 బుధవారం కేవలం నాల్గవ కలశపూజ మిగులుగా ఉన్నవారు మాత్రమే భారతదేశంలో మరియు విదేశాలలో మార్చ్ 14 ఉదయం 6  గంటల నుంచి 10 గంటల లోపల ఆచరించుకోవాలి. పుణ్య స్త్రీలు, వైదవ్య స్త్రీలు, బాలలు, అవివాహితులు, వృద్దులు, పురుషులు (భార్యా వియోగులు కూడా) ఎవరైనను ఆచరించవచ్చును. పురుడు లేక మరణ అసౌచము వున్నవారు ఆచరించవద్దు ఒకరి తరఫున మరొకరు కూడా ఆచరించవచ్చును. సంకల్పం ముఖ్యము. ఆరవ మాసం ప్రారంభమైన గర్భిణులు వద్దు. విదేశాలలో వున్న వారి కొరకు ఇక్కడ వారు ఆచరించవచ్చు.
  • గృహం లోని ఈశాన్య భాగంలో కాని లేక ఈ ఇతర భాగంలో కాని మీరు తూర్పు దిశగా చూసేలా పూజను చేసుకోండి.
  • ఓ పీట వుంచి దానిపై ఎరుపు వస్త్రాన్ని పరవండి. దానిపై బియ్యాన్ని పోసి, గుండ్రంగా లేక చదరంగా లేక దీర్ఘ చతురశ్రంగా నెరపండి.
  • దీపారాధన చేసుకోండి.
  • బియ్యంపైన స్వస్తిక్ మార్క్ రుమాలును వుంచండి.
  • స్వస్తిక్ మార్క్ రుమాలుపై త్రిభుజాకారంగా ఉండే రుమాలును ఉంచండి. స్వస్తిక్ దిగువన ఉన్న వస్త్రపు కోణము మీ వైపుకు ఉండేలా పెట్టుకోండి.
  • అలాగే త్రిభుజం వేసిన వస్త్రంలోని త్రిభుజ కోణము మీ వైపుకు ఉండేలా, స్వస్తిక్ రుమాలు పై వేయండి. అనగా కలశానికి ముందు వైపు త్రిభుజం యొక్క భుజం రాకూడదు. కోణం రావాలి.
  • త్రిభుజ రుమాలుపై కలశాన్ని పెట్టండి. ( రాగి, వెండి, స్టీలు ఏదైనాను పరవాలేదు ) కలశాన్ని కూడా గంధ, కుంకుమలతో అలంకరించుకోండి.
  • కలశంలో సగానికంటే తక్కువగా నీటిని పోయండి. ఆ నీటిలో సుగంధమునకై ఓ యలక్కాయను వేయండి. కలశంలో 5 మామిడాకులు  ఉండేలా చేసుకోండి.
  • కలశంపై కొబ్బరి కాయను వుంచండి. కలశం మీదనున్న కొబ్బరి కాయ కొప్పుపై దండవలె  11 పోగులతో చేసిన ఎరుపు రంగు సూత్రాన్ని వేయండి.
  • కలశం ముందున నాణెమును లేక నాణెములను ఉంచుకొనండి.
  • తిథి, వార, నక్షత్రాలతో పాటుగా గోత్ర నామాలతో సంకల్పం చెప్పుకొని శ్రీ గణపతిని ప్రార్దించండి.
  • ఆపైన ఈ దిగువ నామాన్ని 27 సార్లు లేక 54 లేక 108 సార్లు భక్తీతో, విశ్వాసంతో పఠి౦చండి. 
  • ఓం జ్వాలామాలినికాక్షిప్తవహ్నిప్రాకార మధ్యగాయై నమః (ఇది లలిత సహస్రనామాలలో 71 వ నామము. )
  • తదుపరి ధూప, దీప, నైవేద్య, కర్పూర, తాంబూలాదులను సమర్పించండి.
  • నైవేద్యమనగా పొంగలిని జగన్మాతకు నివేదించండి. మీకిష్టమైన ఫలాలను, కొబ్బరికాయను కూడా సమర్పించుకోవచ్చును.
  • చివరగా సకల సమస్యల నుంచి గట్టేక్కుతూ ఈ జీవన గమనం సాఫీగా సాగిపోవాలని మనసార భక్తితో, విశ్వాస, నిర్మల, నిశ్చలత్వంతో పూజ చేసుకొనండి.
  • చిన్నపాటి తప్పులేమైన వుంటే క్షమించమని తల్లిని వేడుకోండి. పూజా కార్యక్రమం పూర్తైన తదుపరి తీర్థ, ప్రసాదాలు స్వీకరించండి.
  • పూజ పూర్తి అయిన తర్వాత కలశాన్ని ఉద్వాసన చెప్పే విధంగా కుడి చేతితో స్వల్పంగా కదపండి.
ఇంతటితో స్వస్తిక్ మార్క్ రుమాలు, ఎరుపు రంగు సూత్రము, నాణెములు, షోడశ బిందు సహిత త్రిభుజంతో ఉన్నరుమాలు అనబడే నాలుగు కలశాపూజలు పూర్తి చేసిన వారగుదురు. 



మార్చ్ 14 నాటి రక్షాకవచాన్ని క్రియాత్మకంగా ఉత్తేజపరచుటకు (activation ) సమయము
 
అదృశ్యా దృశ్యరహితా విజ్ఞాత్రి వేద్యవర్జితా
యోగినీ యోగదా యోగ్యా యోగనందా యుగంధరా - 129 (లలితాసహస్ర నామ స్తోత్రం)   
లేదా ఈ క్రింది నామాలను పఠిస్తూ రక్షాకవచము లేక కవచాలను దర్సింపచేయండి.

 
ఓం అదృశ్యాయై నమః  
     ఓం దృశ్యరహితాయై నమః
     ఓం విజ్ఞాత్ర్యై నమః     
     ఓం వేద్యవర్జితాయై నమః
     ఓం యోగిన్యై నమః
     ఓం యోగదాయై నమః
     ఓం యోగ్యాయై నమః
     ఓం యోగానందాయై నమః
     ఓం యుగంధరాయై నమః
(లలితా సహస్రనామావళిలోని 649 నుంచి 657 వరకు)

  • పై నామాలను లేక శ్లోకమును 14 వ తేది రాత్రి సమయంలో గురు, శుక్రులను దర్శించినప్పుడు గాని లేక 15 వ తేది శ్రీ సూర్యనారాయణునికి దర్శింపచేసినప్పుడు పఠి౦చాలి.
  • భారత దేశంలో మరియు విదేశాలలో మార్చ్ 14 రాత్రి 6 గంటల నుంచి 8 గంటల లోపల పడమర దిశలో భరణి సంగమంగా వెలుగొందుతున్న గురు, శుక్రులకు 4 వ రక్షాకవచాన్ని దర్సింపచేయండి. దీనితో పాటు మిగిలిన 3 రక్షాకవచాలను కూడా దర్శింపచేయవచ్చు. 
  • అనివార్య కారణాలచే దర్శింప చేయలేనివారు భారతదేశం మరియు విదేశాలలో ఉండే వారు మార్చ్ 15 గురువారం మూల నక్షత్రం రోజున పగటి సమయంలో 10 గంటల లోపల శ్రీ సూర్యనారాయణ స్వామికి దర్శింపచేయండి.
  • ఒకసారి ఉత్తేజపరిచిన రక్షాకవచాలను ఎన్నిపర్యాములైననూ ఉత్తేజపరచుకోవచ్చు, లేదా నూతన కవచాన్ని మాత్రమే ఆక్టివేట్ చేసుకోవచ్చు.
తొమ్మిది రక్షాకవచాలను ఒకేసారి పొందుటకు అతిత్వరలోనే ఒక శుభకరమైన రోజు సిద్ధంగా వుంది. కనుక ఇప్పటివరకు టీవీ ద్వారా 5 రక్షాకవచాలను గురించి చెప్పటం జరిగింది. 5 వ రక్షాకవచాన్ని పొందలేనివారు 2012 ఏప్రిల్ 6 న పొందవచ్చును. ఇంకనూ 6 , 7 రక్షాకవచాలను 2012 ఏప్రిల్ 15 న రెండింటిని పొందబోతున్నాము. అలాగే 8, 9 రక్షాకవచాలను కూడా 2012 మే 5 న పొందబోతున్నాము. 9 రక్షాకవచాలను కూడా పొందుటకు 2012 జూన్ 5 .... సమయము ఆసన్నమవుతున్నది.
గమనిక 1 : కలశంలోని నీటిని కుటుంభ సభ్యుల శిరస్సుపై చల్లుకొని మిగిలిన నీటిని తులసి చెట్టు, లేక ఇతర మొక్కల మొదళ్ళలో పోయాలి. యాలక్కయను ప్రసాదంగా స్వీకరించవచ్చును. కలశం పై కొబ్బరి కాయను కొట్టుకొని వృధా కానివ్వకుండా తీపి వంటకాలలో ఉపయోగించుకోవాలి. కలశం క్రింద ఉంచిన బియ్యాన్ని తర్వాత రోజులలో భోజన పదార్ధంగా వినియోగించుకోనేది. వృధాగా పోనివ్వవద్దు. బియ్యం క్రింద వ్రుంచిన వస్త్రమును తదుపరి కలశ పూజలలో ఉపయోగించుకోవచ్చు.
గమనిక 2 : గతంలో పొట్టు ఉన్న గోధుమపిండి అవసరము అని చెప్పి ఉన్నాను. ఈ గోధుమపిండి ఒకే సారి తొమ్మిది కలశపూజలు చేసుకొనే సమయములో మాత్రమే అవసరము. ప్రస్తుతము అవసరము లేదు.
గమనిక 3 :తొమ్మిది కలశపూజలు పూర్తి అయ్యే వరకు, పాటకులకు కొంత అయోమయంగా ఉంటున్నట్లు గా వుంటుంది. అందుచేత అయోమయంతో చేసుకోలేనటువంటి వారు ప్రస్తుతం ఆగి ... 2012 జూన్ 5 న ఒకేసారి నా ఆధ్వర్యంలో, నా పర్యవేక్షణలో,  ఆంద్రప్రదేశ్ లో ఓ ప్రత్యేక ప్రాంతంలో ఓంకార మహాశక్తి పీఠం నిర్వహించబోయే కార్యక్రమంలో పాల్గొని ఆచరించుకోండి.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.