Friday, March 19, 2010

శ్రీ వికృతి నామ సంవత్సర లఘు ఫలితాలు - 2

ఆహారధాన్యాల దిగుబడులలో క్రమబద్దీకరణ ఉందును. సాఫ్ట్వేర్ రంగానికి స్వల్పంగా ఆశలు చిగురించును. శాహిత్య, విద్య, వైద్య, సినీ రంగాలు ప్రాధాన్యతను సంతరించుకున్నప్పటికీ, ప్రజలు మరువలేని బాధలు సినిమా రంగంలో ఏర్పడు సూచనుంది. వేద, పురాణ, ఉపనిషత్తులకు చక్కని ప్రాధాన్యత కలగే రీతిలో పరిస్థితులు ఉపకరించును.

6 జూన్ ఆదివారం నుంచి 13 ఆదివారం లోపల తొలకరికి అవకాశములేర్పడును. తొలకరి ప్రారంభమైనప్పటికీ నైరుతి ఋతుపవనాలు ప్రజలకు ఆలస్యంగానే పూర్తి ఆశలు చిగురించును.

ఉత్తర భారతంలో వర్షములధికమై నదులు పొంగి ప్రవహించును. మన రాష్ట్రంలో కరువు రాజ్యమేలుతుండును. ఆంధ్రప్రదేశ్లో రైతాంగం తుఫాను కోసం పరితపించే రీతిలో పరిస్థితులు ఉంటాయంటే అతిశయోక్తి కాదు. వికృతి లో ఋతుధర్మానికి వ్యతిరేకంగా వర్షములున్నందున పంటలు ఆలశ్యంగా ఇంటికి చేరును. మినుములు, నువ్వులు, పెసలు పుష్కలంగా పండును. మిరప ఆటుపోట్లకు గురికాగలదు. దక్షిణాయనంలో యందు మిర్చికి అధిక ధరలుండును.

జూలై, ఆగష్టు నెలలలో అధిక ధరలకు కొంత కళ్ళెం పడును. మత్తు పానీయాల తయారీలోనూ, బెల్లం పరిశ్రమపైననూ నిబంధనలు విధించు అవకాశాములున్నవి. టోకు వర్తకులు ప్రజల నుంచి ధాన్యాలను కొనుగోలు చేసి స్వార్ధచిత్తంతో నిల్వవుంచి తద్వారా అధిక రేట్లతో వినియోగదారులను పలు సమస్యలకు గురిచేయుదురు. శుభకార్యాల పరంపరలో బంగారు వినియోగం తగ్గుముఖం చెందును. బంగారు బిస్కెట్ల కుంభకోణం ఆలశ్యంగా వెలుగు చూసే అవకాశముంది. కాస్మోటిక్స్ వ్యాపారాలత్ ప్రజలు మోసపోవుదురు. స్టాక్ మార్కెట్ అనేకమార్లు మదుపరులను నష్టాలబాటలో పయనింపజేయును. నేర ప్రపంచంతో ప్రజలందరూ భీతిల్లుతుందురు.


ఏప్రిల్ 14 నుంచే ఏర్పడే కుంభమేళా పవిత్రామావాస్యపై ఉగ్రవాదుల దుష్టచర్యలు లేకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ప్రభుత్వాలు చేయాల్సి ఉండటమేకాక, ఆరోగ్య సంబంధమైన జాగ్రత్తలతో ప్రజల రక్షణకు బాసటగా నిలవాల్సిన అవసరం వుంది. 2010 లో రాజధాని ఢిల్లీలో కామన్వెల్త్ క్రీడలకు వచ్చే క్రీడాకారులతో సమస్యలు రాగల అవకాశం వుంది. ప్రభుత్వం ముందు చూపుగా చర్యలు గైకోనేది. లేనిచో సమస్య జటిలమగును.


భారత్, పాక్ సరిహద్దులలో స్వల్పంగా కాల్పులు ఉందునేగానీ యుద్ధం రాదు. అయిననూ పాకిస్తాన్ నుంచి ఘర్షణ ఎక్కువగా ఉండును. బంగ్లాదేశ్, ఇరాన్, ఇరాక్,భారత్లలో కారుబామ్బులు అధికమగును. అమెరికా, బ్రిటన్ దేశాలపై రసాయన ఆయుధాలతో సరిక్రొత్త పోకడలతో గురిపెట్టు సూచన వుంది. పాలస్తీనాలో శాంతి మార్గం కరువగును. చైనాకు చెందినా ఓ మత ధర్మాచార్యుని పెత్తనం శ్రుతిమించుతుంది. భారత్ చైనాల మధ్య ఈ ధర్మాచార్యుతో వివాదాలు వచ్చి నష్టంవాటిల్లే సూచనుంది. నేపాల్లో మావోయిష్టు మారణకాండ శ్రుతిమించును.


శ్రీ విరోధిలో దక్షిణాయనం ప్రారంభమైన 7 వరోజునే సంపూర్ణ సూర్యగ్రహణం గోచరించగా, శ్రీ విక్రుతిలో ఆదివారం అమావాస్య సంపూర్ణ సూర్యగ్రహణం జరిగిన 7 వరోజునే దక్షిణాయనం ప్రారంభమవుతున్నది. విక్రుతిలో 2 సార్లు, ఒకే చాంద్రమాన మాసంలో పూర్ణిమ,అమావాస్యకు సంపూర్ణ సూర్యగ్రహణం - మార్గాశిరంలో పూర్ణిమకు సంపూర్ణ చంద్రగ్రహణం, అమావాస్యకు పాక్షిక సూర్యగ్రహణం జరగనున్నవి. ఈ నాల్గు గ్రహణాలు దనూ, మిధున రాశులలో సంభవించనున్నవి. మార్గాశిరంలో సంభవించనున్న పూర్ణిమ, అమావాస్య గ్రహణాలు రెండూనూ మంగళవారాలే వస్తూ, రెండూ గ్రహణాల మధ్యన ధనుస్సు రాశిలో కుజ, రాహువుల కలయిక జరుగుచూ, కన్యారాశి నుంచి ధనస్సువరకు 4 రాశులలో సప్తగ్రహ ఆచ్చాదన ఉండటంచే ప్రపంచ వ్యాప్తంగా ప్రకృతి వైపరీత్యాలకు హేతువగుచున్నది.


జూన్ 5 శనివారం నుంచి 12 శనివారం వరకు, జూన్ 22 మంగళవారం నుంచి 29 మంగళవారం వరకు, జూలై 6 మంగలవ్చారం నుంచి 13 మంగళవారం వరకు ప్రకృతి వైపరిత్యములు జరుగు అవకాశాములున్నవి. సముద్ర సంబంధ కంపనములు అధికముగా ఉండును. సముద్ర కెరటములు విపరీతముగా ఎగిసిపడే సూచనున్నందున, జాలర్లు, విహార యాత్రికులు సముద్ర చెంతకు వెళ్ళవద్దని సలహా ఇవ్వటమైనది.


27 జూలై 2010 మంగళవారం నుంచి 3 ఆగస్టు మంగళవారం వరకు 8 రోజులు ప్రపంచ ప్రజలు అప్రమత్తులై వుండాలి. వైమానిక సంబంధంగా, రాజకీయ సంబంధంగా, ప్రకృతి వైపరీత్యా సంబంధంగా, ఉగ్రవాద సంబంధంగా, సమస్య ఏదైననూ ప్రభుత్వాలు కట్టుదిట్టమైన ఏర్పాట్లలో ఉండాల్సిన అవసరముందని తెలియజేస్తున్నాను.


2010 నవంబర్ 10 నుంచి 20 వరకు పలుచోట్ల ప్రేలుడు పదార్ధాలను విస్పోటనాలకు ఉపయోగించగా, ప్రేలకుండా ఉన్నవాటిని కనుగొను సూచన. 2010 డిశెంబర్ 16 గురువారం నుంచి 23గురువారం వరకు ధనస్సులో రవి, బుధ, రాహు, కుజులు చాతుర్గః కూతమిచే తూర్పు ఆశియా, ఫసిఫిక్, యూరప్ మరియు భారత్ కు ఈశాన్య ప్రాంతాలలో భూ మరియు సముద్ర కంపనముల తీవ్రత వున్నది. 2010 జనవరి 3,4,5 తేదీలలో ధనస్సులో రాహు, కుజ, బుధ, చంద్రుల చాతుర్గ్రహ కూతమిచే ప్రకృతి వైపరిత్యములకు తావు కలదు. ప్రజలు భయపడవలసిన అవసరం లేదు.


నవమేఘ నిర్ణయానుసారం పుష్కర నామమేఘం మేరు పర్వతమునకు ఈశాన్య భాగంలో ఉద్భవించుటచే, ఈ సంవత్సరంలో 2 భాగములు వర్షము, 4 భాగములు గాలి ఉండును. సముద్రములపై 10 భాగముల వర్షము, పర్వతములపై 7 భాగముల వర్షము, భూమిపై కేవలం 2 భాగములే వర్షించును. అందుచేత ఆంధ్రరాష్టంలోని ప్రతి గ్రామ శివాలయాలలో ధూప, దీప, నైవేద్య, కర్పూర హారతులను, సక్రమముగా చేయులాగున ప్రతి ఒక్కరూ పాటుపడేది. అంతేకాక పుష్యమి, ఆశ్లేష, ఉత్తరాషాడ, శ్రవణం, ధనిష్ఠ, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రములు పూర్తిగా వున్న సమయములలోనే వరుణ సంబంధ జపములుగానీ, యాగములుగానీ చేయులాగున ప్రయత్నించేది. భూమిపై 2 భాగములే వర్షమున్నదని పంచాంగాలలో వుంటే వరుణయాగాలు చేస్తే వర్షం పెరుగుతుందా? అనే ఆలోచనలో ఎంతోమంది ఉండవచ్చు. ఆ 2 భాగాల వర్షమే... స్వల్ప, స్వల్పంగా సంవత్సరమంతా వర్షించకుండా... అన్నదాతకు అవసరమైన సమయంలోనే వర్షిస్తే .... చాలు. ఇందుకోసమే ఋతుధర్మానుసారం వర్షించాలనే విశ్వాసంతో వరుణ సంబంధ జపాలు, యాగాలను దక్షిణ సంబంధ ఫలాపేక్ష లేకుండా చేసేది.


ప్రజలందరూ యజ్ఞయాగాది శాంతి క్రతువులు ఆచరిస్తూ, ఎనలేని సంయనంతో, ఓర్పుతో, మానవతాదృష్టితో ఉండాలని భగవంతుని కోరుకుంటూ.. సర్వేజనా సుఖినోభవంతు సమస్త సన్మంగళాని భవంతు ... శ్రీనివాస గార్గేయ



Tuesday, March 16, 2010

శ్రీ వికృతి నామ సంవత్సర లఘు ఫలితాలు

శ్వేతవరాహకల్పము నందలి ఏడవదైన వైవస్వత మన్వంతరము నందలి 28వ మహా యుగములోని కలియుగ ప్రధమ పాదములో 5111 వది, ప్రభవాది 60 సంవత్సరములలో 24 దైన, ఈ సంవత్సరమునకు చాంద్రమానముచే " శ్రీ వికృతి " నామ సంవత్సరమని పేరు. త్వష్ట్ర ( విశ్వకర్మ ) దేవతాధీన పంచయుగాంతర్గత, ' ప్రజాపతి' దేవతాధీన 'అనువత్సర'మను నాల్గవదే శ్రీ వికృతి .

శ్లో : వికృతౌ ప్రకృతిర్యాతి వికృతిం వికృతి స్తథా
తథాపిమోదతేలోక శ్చాస్మి వికృతివత్సరే

శ్రీ వికృతి సంవత్సరంలో ప్రకృతి వికృతి అగును. వికృతి ప్రకృతి అగును. అయిననూ ప్రజలు సంతోషంతో వుండురని భావము. ఋతుధర్మాలకు వ్యతిరేకంగా స్థితిగతులు ఉండగలవని యోచించాలి. శ్రీ వికృతి సంవత్సరంలో రాజ్యాధిపత్యము, సేనాధిపత్యము, అర్ఘాదిపత్యము, మేఘాదిపత్యమను నాలుగు ఆదిపత్యములు కుజ గ్రహానికి రాగా, మంత్రిత్వము బుధ గ్రహానికి, దాన్యాదిపత్యము గురు గ్రహానికి, సస్య, నీరసాదిపత్యములు శుక్ర గ్రహానికి, రాసాదిపత్యము సూర్యునికి వచ్చి ఈ ఖగోళ రాజ్యాన్ని పాలించుటకు సంవత్సరాది నుండి కుజ, బుధ, గురు, శుక్ర, రావులు సంసిద్ధులగుచున్నారు. శని గ్రహం మరియు చంద్రులకు ఏఒక్క ఆధిపత్యము లభించలేదు.

గ్రహస్థితులను పరిశీలించగా అధిక వైశాఖ మాసముతో 384రోజులు జరిగే శ్రీ వికృతి సంవత్సరానికి రాజు కుజుడు. సంవత్సర ప్రారంభంలోనే నీచ సంచారంతో 72రోజులు, కార్తిక మాసం నుంచి అస్తమయ స్థితిలో 132రోజులు, కన్యా రాశిలో శత్రుగ్రహ శనితో సంఘర్షణ 43 రోజులు పోగా,రాజైన కుజునకు వికృతి సంవత్సర పరిపాలనకు అర్హత కలిగిన రోజులు కేవలం 137మాత్రమె. గణాంకాలు ఇలా వుంటే రాజ్యాదిపత్యం కైవసం చేసుకొన్న రోజు నుంచే శత్రుగ్రహ నక్షత్రమైన పుష్యమిలో కుజుడు ఉండి, సంవత్సరాంతంలో కూడా శత్రుగ్రహ నక్షత్రమైన ఉత్తరాభాద్రలో సంచారం చేయటం గమనార్హం.శత్రు నక్షత్రంలో నీచ స్థితిలో పదవిని అలంకరించి, మధ్యలో శత్రువుతోనే పోరాడి, అధిక కాలం అస్తమయదశలో శత్రు నక్షత్రంతోనే సంవత్సరం ముగియటం అనేది అరుదుగా జరిగే గ్రహస్థితి.

వికృతి సంవత్సర రాజు కుజుని పరిపాలనచే రాష్ట్రాల నడుమ, దేశాల నడుమ విరోధాలు అధికమగును. వింత రోగాలు ప్రబలి, అగ్నిభయములుండి, వ్యవసాయ రంగం తిరోగామనములో ఉంటూ ఉగ్రవాద చర్యలు మితిమీరుతూ అధిక ప్రాంతాలలో అనావృష్టి రాజ్యమేలుతూ, ఋతుధర్మ మార్పులతో ప్రజలకు అసౌకర్యముంటూ ప్రజలు భయపడే అవకాశం వుంది.

నిజ నేరస్తులు రాజాలుగా పల్లకిలో ఊరేగుదురు. హోంశాఖ ఉన్నతాధికారులు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేయుదురు. దేశ వ్యాప్త సచివాలయాలలో అవినీతిమయముతో లొసుగులు ఏర్పడి పాలకుల గుట్టురట్టగును. ప్రజల అవసరాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి సమన్వయపాత్ర పోషించే ప్రసార మాద్యమాలపై దాడులు జరిగే అవకాసం కలదు. ప్రభత్వ ప్రజాకర్షక పధకాలు సక్రమంగా ప్రజలకు అందనందున సరిక్రొత్త ప్రభువుల కొరకు ప్రజలందరూ వెంపర్లాడుతుండురు.

పాలకులు దైర్య సాహసాలతో పరిపాలన పరమైన నిర్ణయాలను తీసుకోనలేరు. రాజకీయ అస్తిరతలు యేర్పడును. పరిపాలనలో బుద్ధిబలమును ఉపయోగించిననూ శత్రువులను పాలకులు ఎడుర్కొనలేరు. దేశ వ్యాప్త రాజకీయాలలో స్త్రీలకు ఉగ్రవాదుల నుంచి ముప్పు వాటిల్లే అవకాశము వున్నది. భారీ వ్యాపార రంగములు అనుకోకుండా ఆటుపోటులను ఎదుర్కొనటంతో, దాని ప్రభావంతో కొన్ని రాష్ట్రాల భవితవ్యం బీటలువారును.

తరువాయి భాగం మరు పోస్టింగ్ లో