Monday, January 11, 2010

గురు కుజుల రెండవ షష్టాష్టక ప్రభావము

షష్టాష్టక చతుష్టయములో రెండవ షష్టాష్టకం గురుగ్రహము కుజగ్రహము మధ్య ఏర్పడినది. ఈ రెండు గ్రహాలూ -5 అక్టోబర్ 2009 నుంచి 20 డిశంబర్ 2009 వరకు, వాటి వాటి నీచ స్థానాల నుంచి ఎదురెదురు వీక్షణలు కల్గి వున్నాయి. ఇలా ఎదురెదురు వీక్షనలనే సమసప్తక స్థితి అంటారు. ప్రస్తుతం ఈ సమసప్తక స్థితి షష్టాష్టకస్థితి కానున్నది.

మేష వృశ్చిక రాశులకు, చిత్త, ధనిష్ఠ, మృగశిర నక్షత్రాల అధిపతి కుజుడు 2009 అక్టోబర్ 5 న తన నీచ స్థానమైన కర్కాటక రాశిలోనికి ప్రవేశించటం జరుగుతుంది. అలాగే ధనూ మీనా రాశులకు , పునర్వషు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్రాలకు అధిపతి గురువు 20 డిశంబర్ 2009 న కుంభ రాశిలోనికి ప్రవేశం జరుగుతుంది.

ఈ రెండవ షష్టాష్టకం కుజ గురుల మధ్య 156 రోజుల పాటు కొనసాగుచున్నది. ఈ 156 రోజులలో జంట గ్రహణాలు ఆయాస్థానాలకు వ్యయ ( 12 ) స్థానంలో రావటం విశేషం. డిశంబర్ 20 నుంచి షష్టాష్టకం ప్రారంభం కాగానే, డిశంబర్ 22 నుంచి మార్చి 9 వరకు వక్ర స్థితిలో కుజుడు ఉండటము, వక్ర ప్రారంభపు రోజు, వక్ర త్యాగమైన రోజు, రెండు కూడా మంగళవారాలే రావటము గమనించతగిన అంశము.

ఈ కుజ గురు షష్టాష్టక ప్రభావము మృగశిర, చిత్త, ధనిష్ఠ, పునర్వషు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్ర జాతకులపైననూ, ప్రస్తుతం కుజ మహర్దశ, గురు మహర్దశ జరిగే జాతకులపై ప్రభావం పరోక్షంగా ఉండుటకు అవకాశం వున్నది.

మృగశిర 1,2 పాదాల వృషభ రాశి జాతకులు సోదర సోదరి విషయాలపై శ్రద్ధ తీసుకోవాలి. భూ సంబంధ లావాదేవీలలో జాగ్రత్తలు వుండాలి. నిత్యం వున్న దినచర్యలో జాగ్రత్తగా మార్పులు చేసుకుంటూ వుండాలి. తొందరపాటు నిర్ణయాలు వద్దు.

మృగశిర 3,4 పాదాలు, పునర్వశు 1,2,3 పాదాల మిధున రాశి జాతకులు ఆర్ధిక లావాదేవీలు, కళత్ర విషయాలపై దృష్టి ఎక్కువగా ఉంచాలి. నేత్ర సంబంధ రుగ్మతలకు వకాశామున్నది. ఎదుటి వారితో సంభాషించే ముందు సంయమనం పాటించాలి. దుర్భాష మాట్లాడుట తగ్గించుకోవాలి. పితృ సంబంధ విషయాలపై ఆలోచనలను అధికం చేయండి.

పునర్వసు నక్షత్ర 4 వ పాద కర్కాటక రాశి జాతకులు వ్యక్తిగత విషయాలపై తొందరపడి నిర్ణయాలు తీసుకోనవద్దు. మీ వ్యక్తిగత విషయాలపై ఇతరులతో చర్చించవద్దు. ప్రాణ భయం వెంటాడే అవకాశం ఉండును. దిగులు చెందవద్దు.

చిత్త నక్షత్ర 1,2 పాదాల కన్యారాశి జాతకులు రుణ విషయాలలో ఆలోచనలకు పదును పెట్టాలి. శత్రు భయం పెరిగే అవకాశం వుంది. కొన్ని రుగ్మతలచే అనారోగ్య వ్యాప్తి నొందవచ్చు. దాచుకున్న డబ్బుకు గండం కలిగే అవకాశముంది. లాభ సంబంధ లావాదేవీలు నష్టాల బాటన నడిచే అవకాశముంది.

చిత్తా నక్షత్ర 3,4 పాదాలు, విశాఖ 1,2,3 పాదాల తులా రాశి జాతకులు సంతాన విషయాలలో ఆలోచనలను కట్టుదిట్టం చేయాలి. దినచర్యలో మార్పులను గమనించాలి. వ్యత్రేకంగా వుండే పరిస్థితులలో నిర్ణయాలు తీసుకోనవద్దు. విశాఖ నక్షత్ర 4 వ పాద వృశ్చిక రాశి జాతకులు వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వాహన, ఆరోగ్య విషయాలలో అధిక జాగ్రత్తలు తీసుకుంటూ, లాభ సంబంధ లావాదేవీలపై ఓ దృష్టి ఉంచుతూ మాతృమూర్తి విషయాన్ని కూడా ఆలోచిస్తూ శ్రద్ధ తీసుకోనాలి.పితృ నిర్ణయాలలో తొందరపాటు వద్దు.

ధనిష్టా నక్షత్ర 1,2 పాదాల మకర రాశి జాతకులకు ఆర్ధిక లావాదేవీలు, కళత్ర విషయాలపై దృష్టి ఎక్కువగా ఉంచాలి. నేత్ర సంబంధ రుగ్మతలకు అవకాశమున్నది. ఎదుటివారితో సంభాషించే ముందు సంయమనం పాటించాలి. దుర్భాష మాట్లాడుట తగ్గించాలి. కళత్ర విషయాలలో ప్రతికూలతలు ఉండగలవు, బేధాబిప్రాయములు ఉండగలవు. వ్యక్తిగత విషయాలపై తొందరపడి నిర్ణయాలు తీసుకోనవద్దు. మీ వ్యక్తిగత విషయాలపై ఇతరులతో చర్చించవద్దు. దాచుకున్న డబ్బుకు గండం కలిగే అవకాశముంది.
పూర్వాబాద్రా నక్షత్ర 4 వ పాద మీనా రాశి జాతకులకు సంతాన విషయాలలో ఆలోచనలు చేయాలి.ముఖ్య నిర్ణయాలు కట్టుదిట్టం చేయాలి. అనవసర ఖర్చు పెరిగే అవకాశం వుంది. పొదుపును పాటించండి. లోభత్వాన్ని అలవాటు చేసుకోండి.

ఈ షష్టాష్టక ప్రభావము వలన ఫలితాలు తెలుసుకోనటమే గాక, కొన్ని జాగ్రత్తలు తీసుకోనాల్సి వుంటుంది. గ్రహ సంబంధమైన శాంతి పరిహారములను కూడా ఆచరించేది. ఈ శాంతి పరిహారములు తగిన రీతిలో తగిన సమయములో మా ఓంకార మహాశక్తి పీఠంలో వేద క్రియల ద్వారా శాంతి పరిహారములు జరుపబడును. వేద క్రియలు జనవరి 25 తదుపరి మాత్రమే జరుపుకోనాలి. అలాంటి వివరాలు కూడా తదుపరి పోస్టింగ్ లలో చెప్పగలము.

Wednesday, January 6, 2010

కుజ రాహువుల మొదటి షష్టాష్టక ప్రభావము

2009 నవంబర్ 2 న ధనూరాశిలోకి రాహుప్రవేశం జరిగింది. దీనికి ముందు నుంచే 5 అక్టోబర్ 2009 న కుజగ్రహము తన నీచ స్థానమైన కర్కాటక రాశిలోనికి ప్రవేశించటం జరిగింది. నవంబర్ 2 నుంచి రాహు ధనూప్రవేశంతో కుజ రాహువుల మధ్య షష్టాష్టక స్థితి ఏర్పడినది. అంటే అంతకు ముందు 2009 ఆగస్టు 16 ఆదివారం నుంచి 5 అక్టోబర్ వరకు 51 రోజుల పాటు రాహు కుజుల షస్టాష్టక స్థితి ఏర్పడినది. ఈ సమయములోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఘోర ప్రమాదంలో మరణించటం, ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సంక్షోభం ఏర్పడటానికి 51 రోజుల షష్టాష్టక స్థితి ప్రధాన కారణమైంది.

కేవలం పై ఒక్క షష్టాష్టక స్థితి మాత్రమే గాక, దీనికితోడు 22 జూలై కర్కాటక రాశిలో జరిగిన సంపూర్ణ సూర్య గ్రహణం రాజశేఖరరెడ్డి జన్మ రాశి ధనస్సుకు, అష్టమ స్థానం కావటం కూడా గమనార్హం. ఈ విషంపై హైదరాబాద్ నుంచి మహా టీవీలో గ్రహణం పై చర్చ జరిగినప్పుడు, రాజశేఖరరెడ్డికి అష్టమ స్థానంలో ( ప్రాణ స్థానం ) గ్రహణం జరగనుంది. గనుక వాహన సంబంధంగా అనేక జాగ్రత్తలు తీసుకోనవలసి ఉంటుందని లైవ్ లో చెప్పటం జరిగింది.

ప్రస్తుతం షష్టాష్టక చతుష్టయంలో మొదటిదైన కుజ రాహువుల ప్రధమ షష్టాష్టకం 2009 నవంబర్ 2 నుంచి 2010 మే 26 వరకు 206 కొనసాగుతుంది. ఈ 206 రోజులలో జంట గ్రహణాలు రావటము జరిగినది. కర్కాటక రాశి కుజ గ్రహానికి నీచ స్థితి. ఈ కర్కాటకంలో కుజుడు డిసెంబర్ 22 నుంచి మార్చి 2 వరకు వక్ర స్థితిలో వుండటం విశేషం. వక్ర ప్రారంభపు రోజైన డిసెంబర్ 22, వక్ర త్యాగమైనా రోజు మార్చి 9 , రెండూను మంగళ వారాలే కావటం గమనించతగిన అంశం. కుజ రాహువుల షష్టాష్టక ప్రభావం వలన చిత్ర, ధనిష్ఠ, మృగశిర, ఆరుద్ర, స్వాతి, శతభిషం నక్షత్ర జాతకులపై పరోక్షంగా వుంటుంది. ఎందుచేతనంటే కుజగ్రహ నక్షత్రాలు చిత్ర, ధనిష్ఠ, మృగశిర. రాహు గ్రహ నక్షత్రాలు ఆరుద్ర, స్వాతి, శతభిషం. పై ఆరు నక్షత జాతకులే గాక, ప్రస్తుతం కుజ మహర్దశ, రాహు మహర్దశ జరిగే జాతకులపై ప్రభావం పరోక్షంగా వుంటుంది.

మృగశిర నక్షత 1,2 పాదాల వృషభ రాశి జాతకులు సోదర సోదరి విషయాలపై శ్రద్ధ తీసుకోనాలి. భూ సంబంధ లావాదేవీలలో జాగ్రత్తలు వుండాలి. ప్రాణ సంబంధ భయం వెంటాడే అవకాశం ఉండును.

మృగశిర నక్షత్ర 3,4 పాదాలు మరియు ఆరుద్రా నక్షత్ర జాతకులు ఆర్ధిక లావాదేవీలు, కళత్ర విషయాలపై దృష్టి ఎక్కువగా ఉంచాలి. నేత్ర సంబంధ రుగ్మతలకు అవకాశమున్నది. ఎదుటివారితో సంభాషించే ముందు సంయమనం పాటించాలి. దుర్భాష మాట్లాడుట తగ్గించాలి. కళత్ర విషయాలలో ప్రతికూలతలు ఉండగలవు, బెదాబిప్రాయములు ఉండగలవు.

చిత్ర నక్షత్ర 1,2 పాదాల కన్యా రాశి జాతకులు వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వాహన, ఆరోగ్య విషయాలలో అధిక జాగ్రత్తలు తీసుకుంటూ, లాభ సంబంధ లావాదేవీలపై ఓ దృష్టి ఉంచుతూ మాతృమూర్తి విషయాన్ని కూడా ఆలోచిస్తూ శ్రద్ధ తీసుకోనాలి. లాభ విషయాలలో పదే పదే ఆలోచనలు చేయాలి.

చిత్ర నక్షత్ర 3,4 పాదాలు, స్వాతి నక్షత్ర తులారాశి జాతకులు భూ లావాదేవీలలో జాగ్రత్తగా వుండాలి. భూమి కొనుగోలు అమ్మకాలలో కొంత సమయం ఆగాల్సి వుంటుంది. సోదర, సోదరిలతో తొందరపాటు వద్దు. మీ దినచర్యలో అనుకోకుండా అవాంతరాలు ఏర్పడటానికి అవకాశాలు వుంటాయి. మనసును అదుపులో వుంచుకొని గుండె దిటవు చేసుకోవాలి. తోదరపాటు నిర్ణయాలు వద్దు.

ధనిష్టా నక్షత్ర 1,2 పాదాల మకర రాశి జాతకులు దాంపత్య విషయాలలో తొందరపాటు చర్యలు వద్దు. ప్రేమికుల మధ్య అభిప్రాయ బేధాలు ఉండగలవు. అనవసర ఖర్చు పెరిగే అవకాశం వుంది. వివాహ నిర్ణయ విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. కళత్ర వర్గం ద్వారా సమస్యలు జటిలమయ్యే అవకాశాలున్నవి.

ధనిష్టా నక్షత్ర 3,4 పాదాలు, శతభిషా నక్షత్ర కుంభ రాశి జాతకులు ఋణ విషయాలలో ఆలోచనలకు పదును పెట్టాలి. శత్రు భయం పెరిగే అవకాశం వుంది. కొన్ని రుగ్మతలచే అనారోగ్య వ్యాప్తి నొందవచ్చు. దాచుకున్న డబ్బుకు గండం కలిగే అవకాశముంది. లాభ సంబంధ లావాదేవీలు నష్టాల బాటన నడిచే అవకాశముంది.

మృగశిర, ధనిష్ఠ, చిత్ర నక్షత్ర జాతకులకు రెండవ షష్టాష్టకమైన గురు కుజుల వలన కూడా సమస్యలు రాగల సూచనలున్నవి. గనుక గురు కుజుల రెండవ షష్టాష్టక ప్రభావము అని మరో శీర్షిక త్వరలో పోస్టింగ్ కానున్నది. అంచేత దానిలోని ఫలితాలు కూడా చదవగలరు.

ఈ షష్టాష్టక ప్రభావము వలన ఫలితాలు తెలుసుకోనటమే గాక, కొన్ని జాగ్రత్తలు తీసుకోనాల్సి వుంటుంది. గ్రహ సంబంధమైన శాంతి పరిహారములను కూడా ఆచరించేది. ఈ శాంతి పరిహారములు తగిన రీతిలో తగిన సమయములో మా ఓంకార మహాశక్తి పీఠంలో వేద క్రియల ద్వారా శాంతి పరిహారములు జరుపబడును. వేద క్రియలు జనవరి 25 తదుపరి మాత్రమే జరుపుకోనాలి. అలాంటి వివరాలు కూడా తదుపరి పోస్టింగ్ లలో చెప్పగలము.

Monday, January 4, 2010

సప్త అమాసంక్రాంతుల మాలిక

ప్రతినెలా ఓ అమావాస్య వస్తుంటుంది. అలాగే ప్రతినెలా ఓ సంక్రమణం జరుగుతూ వుంటుంది. సంక్రమణం అంటే సూర్యుడు ఒక రాశిలోకి ప్రవేశించటం. దీనినే సంక్రాంతి అని కూడా పిలుస్తారు. మకర రాశిలోనికి సూర్య ప్రవేశాన్ని మకర సంక్రమణం లేక మకర సంక్రాంతి అంటాము. మరి ఈ సంక్రమణం ఏదో ఒక తిధి లో జరుగుతూ వుంటుంది.

మరి సంక్రమణం అమావాశ్య తిధిలో జరిగితే ఎలా వుంటుంది ? ఒకసారి కాదు, రెండుసార్లు కాదు. వరుసగా ఏడు నెలలపాటు అమావాశ్య తిదిలోనే రవి రాశిప్రవేశాలు చేయటం జరిగినది. మరి ఇలా ఏడు సార్లు రాశిప్రవేశాలు అమావాస్యన జరిగితే అరిష్టమా? అదృష్టమా?

వివరాలలోకి వెళితే గత 2009 సంవత్సరంలో ఆశ్వీయుజ అమావాశ్య శనివారం తే 17.10.2009 దిన దీపావళి పర్వదినం జరుపుకున్నాము. ఆరోజే రవి తన నీచ స్థానమైన తులారాశిలోకి సంక్రమించాడు. దీనిని తులా సంక్రాంతి అంటారు. అమావాస్య తిధిలో సంక్రమణం జరిగిన మాలికలో ఇది మొదటిది.

తదుపరి కార్తిక అమావాశ్య సోమవారం తే 16.11.2009 దిన రవి వృశ్చిక రాశిలోనికి సంక్రమించాడు. దీనిని వృశ్చిక సంక్రాంతి అంటారు. దీనిని రెండవ అమాసంక్రాంతి దినముగా పరిగణించాలి. ఆ తరువాత మూడవదైన మార్గశిర అమావాస్య తే 15.12.2009 దిన మంగళవారం రాత్రి రవి ధనస్సులోనికి ప్రవేశించుటచే ధనుర్మాసం ఏర్పడినది. ఈ ధనుర్మాసం కూడా అమావాశ్య తిధిలో వచ్చినది. దీనినే ధనుస్సంక్రాంతి అంటారు. ఇక నాల్గవదైన పుష్య అమావాస్య తే 14.01.2010 గురువారం మకరరాశిలోకి రవి సంక్రమణం చెందాడు. దీనితో మకర సంక్రమణ ఉత్తరాయణ పుణ్య కాలం ప్రారంభమైనట్లు. ఇది కూడా అమావాస్య తిదిలోనే జరిగినది.

పిదప రాబోవు ఫిబ్రవరిలో మాఘ అమావాస్య తే 13.2.2010 ది రోజున కుంభ సంక్రాంతి జరుపుకొనబోతున్నాము. ఇది 5 వ అమావాస్య తో కూడిన సంక్రాంతి అన్నమాట. ఆ తదుపరి తే 15.3.2010 దిన పాల్గుణ అమావాస్య రోజున మీనా సంక్రాంతి జరుపుకోవాలి. ఇది ఆరవ అమావాస్య తిదితో కూడిన సంక్రాంతి. ఇక మాలికలో చివరిదైన ఎదవా అమావాస్య. స్వస్తిశ్రీ వికృతి సంవత్సర చైత్ర అమావాస్య తే 14.4.2010 రానుంది. ఆరోజే మేష సంక్రమణం జరుగుచూ మహా కుంభ మేలా హరిద్వార్ లో జరగనున్నది.

వరుసగా ఏడు అమావాస్య తిధులలో సంక్రమణాలు జరగాతము మహా అరుదుగా వచ్చీ ఘట్టం. ఇంత అరుదుగా వచ్చే ఘట్టానికి మధ్య బిందువు అంటే 4 వ అమావాస్య తిధిలో సంక్రమణం. మకర సంక్రమణం జరిగిన ఈ పుష్య అమావాశ్య తిధిలో కనకన సూర్య గ్రహణం జరగటం అత్యంత అరుదైన మహోన్నత ఘట్టం.

ఇక ఈ జనవరి 15 కనుమ పండుగ రోజున మకర సంక్రమణం వచ్చిన అమావాస్య, దానికి తోడు గ్రహణం జరగనున్నవి. అమావాశ్య తిధిలో పితృదేవతలకు తర్పణాదులు ఇస్తాము. దీనికి సంక్రమణం కలిసి, గ్రహణం కలిస్తే, ఎంతటి అదృష్టమో ఆలోచించండి. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇదే రోజు మహా కుంభ మేలా రెండవ పవిత్ర స్నానం కావటం మహద్భాగ్యం. మహాద్భాగ్యమైన మహోన్నత రోజున పితృదేవతలకు పిండ ప్రదానాదులను, తర్పణాదులను ఇవ్వాల్సి వుంటుంది. అవకాశం వున్నవారు సముద్రస్నానం ఆచరించవచ్చు. మకర రాశిలో జరిగే గ్రహణం ఒక అరిష్ట యోగంలో భాగామైనప్పటికీ, దాని ప్రభావం గూర్చి ప్రస్తుతం మనం ఆలోచించటం లేదు. గ్రహణం జరిగే రోజును మహా పవిత్రదినంగా హైందవ జాతి అంతా కొనియాడి తీరాలి.

మహా కుంభ మేళా పవిత్రస్నాన వివరాలు :

శ్రీ విరోధి నామ సంవత్సరంలో గురు గ్రహము 19 డిశంబర్ 2009 రాత్రి 1 గం. 08 ని.లకు కుంభరాశి ప్రవేశం చేయును. అలాగే శ్రీ సూర్య భగవానుడు రాబోవు వికృతి నామ సంవత్సరంలో 14 ఏప్రిల్ 2010 న మేష రాశిలోకి ప్రవేశించును. ఈ కారణంగా హరిద్వార్ లోని గంగానదిలో పవిత్ర స్నానాలతో మహా కుంభ మేళా జరుగును.

ఈ పవిత్ర స్నానాలకు దేశ విదేశాల నుంచి యోగిణులు, యోగులు, సాధువులు, ఇతరులు, కలిసి దాదాపు 60 మిలియన్ల మంది స్నానమాచారిన్చేదారు. ఈ పరంపరలో 2010లో జనవరి 14 మకర సంక్రాంతి రోజున ప్రధమ పవిత్ర సంక్రమణ స్నానముండును. ఈరోజే పుష్య అమావాశ్య పవిత్ర స్నానం కూడా. (స్నానానికి అమావాశ్య నిశీధిలో వుండాలి. ) జనవరి 15 సంపూర్ణ సూర్య గ్రహణం రోజున ద్వితీయ పవిత్ర స్నానముండును. జనవరి 20 వసంత పంచమి రోజున తృతీయ పవిత్ర స్నానముండును. జనవరి 30 మాఘ పూర్ణిమ రోజున చతుర్ధ పవిత్ర స్నానముండును. ఫిబ్రవరి 12 మహా శివరాత్రి రోజున పంచమ పవిత్ర స్నానముండును. ఫిబ్రవరి 13 మాఘ అమావాశ్య రోజున షష్టమ పవిత్ర స్నానముండును. ఏప్రిల్ 14 మేష సంక్రమణం రోజున చిట్టచివరిదైన మహా కుంభ మేలా పవిత్ర సంక్రమణ స్నానంతో హరిద్వార్ మహా కుంభ మేళా ముగియును.

ఆంధ్రప్రదేశ్ పై జన్మశని ప్రభావం

1 నవంబర్ 1956 దుర్ముఖి నామ సంవత్సరం ఆశ్వీయుజ బ. చతుర్దశి రోజున చిత్రా నక్షత్రంలో ఆంధ్రప్రదేశ్ అవతరణ జరిగినది. ఆంధ్రప్రదేశ్ జన్మ నక్షత్రం చిత్రానక్షత్రం కన్యా రాశి. 2007 జూలై నుంచి ఏలినాటి శని జరుగుచూ 2014 నవంబర్ తో ముగియనుంది. ఈ ఏలినాటి శని మూడు భాగాలు మొదటి భాగాన్ని ద్వాదశ శని లేక వ్యయ శని అంటారు. ఇది 2009 ఆగస్టు చివరితో ముగుసిపోయింది. 2009 సెప్టెంబర్ నుంచి 2012 ఆగస్టు వరకు జన్మ శని భాగం జరుగుతున్నది. మూడవ భాగ శని సెప్టెంబర్ 2012 నుంచి నవంబర్ 2014 వరకు జరుగును.

ప్రస్తుతం ఏలినాటి శని రెండవ భాగం జరుగుచున్న ఈ రోజులలో తెలంగాణా ఉద్యమం అధికమైంది. ప్రజలలో ప్రస్తుతం ఒక వినికిడి వుంది. అది ఏమంటే... రాజశేఖరరెడ్డి బ్రతికుంటే...... కే.సి.ఆర్ ఇలా విజృంభించే వాడు కాదని. కానీ జ్యోతిష్యపరంగా వారి ఆలోచన మాత్రం తప్పు. ఎందుచేతనంటే... కే.సి.ఆర్ ఆశ్లేష నక్షత్ర కర్కాటక రాశి జాతకుడు. వారికి 2002 జూన్ నుంచి 2009 ఆగస్టు వరకు ఏలినాటిశని భాగం జరిగింది. మూడు భాగాల శని పూర్తి చేసుకొని కే.సి.ఆర్ దేనికైనా సిద్ధంగా వున్నాడు.

కే.సి.ఆర్ కు ఏలినాటిశని పూర్తి అయిన ఘడియ నుంచే ఆంధ్రప్రదేశ్ జన్మశని భాగం మొదలైంది. అందుచేతనే ... సెప్టెంబర్ లో ముఖ్యమంత్రిని కోల్పోవటం, తరువాత జరిగిన వరుస పరిణామాలను చూస్తూనే ఉన్నాము.

ఇక్కడ ఒక విషయం గమనించాలి. కే.సి.ఆర్ కు జన్మ రాశిలోనికి కుజుడు 5 అక్టోబర్ నుంచి ప్రవేశించి 2010 మే 26 వరకు 234 రోజులు స్తంభించటం జరిగినది. అందుచేత కే.సి.ఆర్ కు లగ్నంలో నీచ కుజ స్తంభన ఉండటంచే ప్రత్యేక తెలంగాణా కోసం, గతం కంటే ఇంకా హడావిడి చేయటం జరుగుచున్నది. మే 26 తదుపరి కుజుడు కే.సి.ఆర్ కు వాక్ స్థానంలోకి ప్రవేశించి జూలై 20 వరకు ఉంటాడు. గనుక 5 అక్టోబర్ 2009 నుంచి 20 జూలై 2010 వరకు కే.సి.ఆర్ విజృంభణతో రాష్ట్రంలో శాంతి భద్రతలు మరికొంత దెబ్బతినే అవకాశముంది.

ప్రస్తుతం ఒక విషయం గమనించాలి. ఆంధ్రప్రదేశ్ జన్మ నక్షత్రం చిత్ర. చిత్రా నక్షత్రానికి అధిపతి కుజుడు. జరిగేది జన్మ శని. పైగా ఈ సంవత్సరం లో 20 జూలై నుంచి 31 ఆగస్టు వరకు ఆంధ్రప్రదేశ్ జన్మ రాశి కన్యలో కుజగ్రహం, శనిగ్రహం కలయికలు జరుగుచున్నవి. అందువలన శాంతిభద్రతలు ఇంకా విషమించే అవకాశం వున్నది.

దీనికితోడు చిదంబరం గారు డిశంబర్ 9 తేదీన మొదటి స్టేట్మెంట్ ఇచ్చారు. కుజ సంఖ్య అయిన తొమ్మిదవ తేదీన, తొమ్మిదవ తిది అయిన నవమిలో రాత్రి సమయములో స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ సమయములో వున్న గ్రహస్థితి ఎవరికీ అనుకూలం కానేకాదు. ఇక రేపటి రోజున 5 జనవరి మంగళవారం రోజున డిల్లీలో ఎనిమిది రాజకీయ పార్టీలతో చర్చలకు ఆహ్వానించారు. రేపటి రోజు కుజవారం. 8 సంఖ్య శనికి సంబంధం. శని కుజులు పరస్పర శత్రువులు. రేపటి నక్షత్రం ఆంధ్రప్రదేశ్ జన్మ నక్షత్రమైన చిత్రకు నైధనతార ( ప్రమాద తార ) అవుతున్నది. దీనినిబట్టి రేపటి చర్చలు పూర్తిగా విఫలమై, శాంతిభద్రతలు ఘోరంగా దెబ్బతిననున్నవి. దీనికి తోడు జనవరి 1 నుంచి జనవరి 15 వరకు గ్రహ సంచారరీత్యా రవాణా రాకపోకలకు పూర్తి అంతరాయాలుంటాయి. ఆంధ్రప్రదేశ్లోనే కాక దేశవ్యాప్తంగా విమాన సర్వీసులు కూడా మంచు కారణంచే ఆగిపోతున్నవి.

రాజశేఖరరెడ్డి గారు మరణించకుండా ఉన్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితి ఇలానే కొనసాగుతుంటుంది. కే.సి.ఆర్ గారికి ప్రస్తుతం అష్టమ స్థానంలో గురువు సంచారం చేస్తూ, కుజునిచే అష్టమ వీక్షణ ఉన్నందున ఆరోగ్య విషయాలపై కే.సి.ఆర్ దృష్టి ఉంచాల్సిన అవసరం వుంది.

ఆంధ్రప్రదేశ్ కు జన్మషని ప్రభావం 2009 సెప్టంబర్ నుంచి 2012 ఆగస్టు వరకు కొనసాగుతుంది. గనుక పైసమయంలో ప్రజలందరూ సంయమనం పాటిస్తూ, భగవతారాధనకు అధిక సమయం కేటాయించాలి.

Saturday, January 2, 2010

ఖగోళంలో షష్టాష్టక చతుష్టయం

వందల సంవత్సరాల తరువాత ఏర్పడే ఖగోళ గ్రహస్థితే షష్టాష్టక చతుష్టయము. అరిష్ట యోగములతో ఈ షష్టాష్టకం ద్వాదశ రాశులపై ప్రభావము చూపుతున్నది. గ్రహ సంబంధ షష్టాష్టకములు మూడు, గ్రహణ షష్టాష్టకము ఒకటి కలిసి మొత్తం నాలుగు షష్టాష్టక స్థితులు ఏర్పడినవి.

1. 2009 నవంబర్ 2సోమవారం నాడు రాహువు ధనుస్సు రాశి ప్రవేశం చేయడంతో, కర్కాటక రాశిలో నీచ స్థితి లో ఉన్న కుజ గ్రహంతో షష్టాష్టకము ఏర్పడినది. అంటే కర్కాటక కుజునికి ఆరవ స్థానమైన ధనస్సులో రహువుండటము, రాహువుకు ఎనిమిదవ స్థానమైన కర్కాటకంలో కుజుడుండటము మొదటి షష్టాష్టక గ్రహస్థితిగా పేర్కొనాలి.

2. 2009 డిశంబర్ 20ఆదివారం నాడు గురుగ్రహము కుంభరాశి ప్రవేశము చేయటంతో, కన్యా రాశి లో ఉన్న శని గ్రహంతో, షష్టాష్టకము ఏర్పడినది. అంటే కన్యా రాశిలోని శని గ్రహానికి ఆరవ స్థానమైన కుంభ రాశిలో గురువుండటము, కుంభ రాశికి ఎనిమిదవ స్థానమైన కన్యలో శని సంచారం చేయటము రెండవ షష్టాష్టకము.

3. 2009 డిసంబర్ 20ఆదివారం నుంచే గురుగ్రహం, కుజ గ్రహం మధ్య షష్టాష్టకము ఏర్పడినది. ఏవిధంగానంటే, కుంభ రాశిలోని గురుగ్రహానికి ఆరవ రాశియైన కర్కాటకలోని కుజుడు, అలాగే కుజ గ్రహానికి ఎనిమిదవ రాశిలో గురుగ్రహం ఉండటము మూడవ షష్టాష్టక గ్రహస్థితి.

ఇంతవరకు గ్రహాల సంచారంలో మూడు షష్టాష్టకములు ఏర్పడ్డాయి. గ్రహాలు కాక గ్రహణాలలో కూడా మరో షష్టాష్టకం ఏర్పడనున్నది.....ఎప్పుడు ? ఎక్కడ ?

4. మిధున రాశిలో భారత కాల మాన తేది ప్రకారం 2010జనవరి 1న పుష్య పూర్ణిమన ఆరుద్రా నక్షత్రంలో పాక్షిక చంద్ర గ్రహణం ఏర్పడినది. జనవరి 15పుష్య అమావాస్య రోజున మకర రాశిలో ఉత్తరాషాడ నక్షత్రంలో కంకణ సూర్య గ్రహణం ఏర్పడనుంది. మకర రాశికి మిధున రాశి ఆరవ రాశి. మిధున రాశికి మకర రాశి అష్టమ రాశి. అనగా షష్టాష్టక రాశులలో గ్రహణాలు ఏర్పడుతున్నాయి. ఇది నాల్గవ షష్టాష్టకం.

జనవరి 15తో నాల్గవ షష్టాష్టక అవయోగం ప్రారంభం కానున్నది. దీని ప్రభావం దాదాపు నాలుగు మాసాలు కొనసాగుతుంది. కానీ గ్రహాల నడుమ ఏర్పడిన షష్టాష్టకములు 25 మే 2010 వరకు కొనసాగుతుంది.
దాదాపు నాలుగు నెలలకు పైగా వుండే షష్టాష్టక చతుష్టయ ప్రభావములు ఎలా వుంటాయి అనే ఆసక్తికర వివరాలు తదుపరి పోస్టింగ్ లో తెలుసుకుందాం.... శ్రీనివాస గార్గేయ